విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమా ‘మట్టి కుస్తీ’. ఐశ్వర్య లక్ష్మి నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడియోస్తో కలిసి రవితేజ ఆర్టీ టీమ్ వర్క్స్ సంస్థ నిర్మిస్తున్నది. చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు.
హీరో విష్ణు విశాల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర గ్లింప్స్ను విడుదల చేశారు. ఇందులో బైక్ నడుపుతూ విలన్లతో ఫైట్ చేస్తున్న హీరో చివరలో రెజ్లింగ్ రింగ్లో ప్రత్యర్థులను ఎదుర్కొవడానికి సన్నద్ధమవడం ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి ఎడిటర్ : ప్రసన్న జీకే, సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం నాథన్, సంగీతం : జస్టిన్ ప్రభాకరన్.