మంచు మోహన్ బాబు నట వారసుడు మంచు విష్ణు మా ఎలక్షన్స్లో ప్రకాశ్రాజ్పై 107 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆదివార జరిగిన ‘మా’ (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్) సాధారణ ఎలక్షన్స్ను తలపిస్తూ నాటకీయ ఘటనల నడుమ ముగిశాయి. చిన్న సెలబ్స్ నుండి స్టార్ హీరోల వరకు అందరు విధిగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అయితే ఎలక్షన్స్ నేపథ్యంలో ప్రకాశ్రాజ్- మంచు విష్ణు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కాని ఆదివారం రోజు సీన్ మారింది. పోలింగ్ బూత్ దగ్గర ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకోవడం, హగ్ చేసుకోవడం అనంతరం పలు సందర్భాలలో ఇద్దరు కలిసి కామెడీలు కూడా చేశారు. అయితే మంచు విష్ణు విజయాన్ని అధికారికంగా ప్రకటించిన సమయంలో విష్ణు భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రకాశ్రాజ్ను పట్టుకుని ఏడ్చేశాడు. అనంతరం విష్ణు తన తండ్రి మోహన్బాబు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయాన్ని తండ్రి మోహన్బాబుకు అంకితమిచ్చారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. బాబా ఆశీస్సులు, మా సభ్యుల ఆదరణతో విష్ణు గెలిచాడు. చిరంజీవి, నాగార్జున, పవన్ కల్యాణ్ సహా అందరి ఆశీస్సులు నా బిడ్డకు ఉన్నాయి అని మోహన్ బాబు పేర్కొన్నారు.