Rathnam Movie | తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. ఈ సినిమాకు సింగం చిత్రాల ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. స్టోన్బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాత. రీసెంట్గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. పూర్తి మాస్ అవతారంలో విశాల్ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్గా ఏప్రిల్ 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇందులో భాగంగా రేపు సాయంత్రం 5 గంటలకు మూవీ ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. విశాల్ నటించిన గత యాక్షన్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని, సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు హరి తెలిపారు.
#Rathnam trailer from tomorrow at 5PM
Starring Puratchi Thalapathy @VishalKOfficial.
A film by #Hari, in theatres on April 26th!
A @ThisisDSP musical pic.twitter.com/30b7EjxAu2
— Madhu VR (@vrmadhu9) April 14, 2024