టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటయ్యినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్షిప్పై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, నేడు ఉదయం 10.10 గంటలకు రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా రష్మిక మెడలో విజయ్ మూడుముళ్లు వేశారని సమాచారం (ఫైల్ ఫొటో ఏఐ). ఈ వివాహ వేడుక రెండు భిన్న సంస్కృతుల కలయికగా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఉదయం విజయ్ కుటుంబ సంప్రదాయం ప్రకారం హిందూ పద్ధతిలో పెళ్లి వేడుక పూర్తికాగా, సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ ఆచారాల ప్రకారం మరోసారి వివాహం జరగనుంది.
ఈ వేడుక కోసం ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే ఉదయ్పూర్ చేరుకున్నారు. పెళ్లికి ముందు జరిగిన సంబరాల్లో భాగంగా ఈ జంట ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం జరిగిన హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ జంట ఇన్స్టా వేదికగా పంచుకోవడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. తమ అభిమాన నటులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడంతో నెటిజన్లు ‘విరోష్’ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉదయ్పూర్లో సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహం అనంతరం, మార్చి 4వ తేదీన హైదరాబాద్లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతల కోసం భారీ వెడ్డింగ్ రిసెప్షన్ను ఏర్పాటు చేయనున్నారు.