Virata Pravam | కరోనా కారణంతో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదలవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో రాధేశ్యామ్, ట్రిపుల్ఆర్, భీమ్లానాయక్ సినిమాలు విడుదలను ప్రకటించాయి. కానీ కరోనా ఉధృతి పెరగడం, ఏపీ టిక్కెట్ల ఇష్యూ వంటి కారణాలతో పెద్ద సినిమాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. ఈ క్రమంలో రౌడిబాయ్స్, బంగార్రాజు సినిమాలు అనూహ్యంగా సంక్రాంతి రేసులోకి వచ్చాయి. ఇక రెండిట్లో బంగార్రాజు సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఫిబ్రవరిలో యూత్ఎంటర్టైనర్గా డీజే టిల్లు ఆకట్టుకోగా, పవర్ ఫుల్ ఎంటర్టైనర్గా భీమ్లానాయక్ భారీ విజయాన్ని సాధించింది.
లేటెస్ట్గా రాధేశ్యామ్ నిరాశపరిచిన ట్రిపుల్ఆర్ ప్రీ బుకింగ్స్ సేల్స్తోనే ప్రభంజనం సృష్టించింది. ఇవే కాకుండా తెలుగులో ప్రతి వారం ఓ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయ్యాయి. కానీ ఒక్క సినిమా మాత్రం ఇంకా విడుదల తేదీపై క్లారిటి ఇవ్వటం లేదు. ఆ సినిమానే ‘విరాట పర్వం’. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నీదినాది ఒకేకథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్లో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ మూవీని అన్ని చిత్రాలతో పాటే వాయిదా వేశారు. మిగితా చిత్రాలు మాత్రం వరుసగా విడుదలవుతుంటే, విరాట పర్వం మాత్రం ఇంకా విడుదలకు నోచుకోలేకపోతుంది. దీనికి ముఖ్య కారణం సరేష్బాబు అంటూ ప్రచారం సాగింది. సురేష్బాబు నారప్ప, దృశ్యం సినిమాల మాదిరిగానే విరాట పర్వం చిత్రాన్ని కూడా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు గతం నుంచి ప్రచారం అవుతుంది.
అయితే ఈ వార్తలపై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకే చాలా వరకు సినిమాలు విడుదల తేదిలను ప్రకటించాయి. దాంతో సరైన తేదీ చూసి ‘విరాటపర్వం’ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.
ఇవి కూడా చదవండి:
R.R.R Business | ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ బిజినెస్.. ‘బాహుబలి-2’కంటే 100కోట్లు ఎక్కువే సాధించాలి
Prabhas | ప్రభాస్ కోసం బాలీవుడ్ యాక్టర్ ఆ పాత్రలో నటించనున్నాడా?
Pushpa: The Rise | పుష్ప సెకండ్ పార్ట్లో.. దిశా పటాని?