Virata Parvam | పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉండే అతికొద్ది మంది నటులలో రానా దగ్గుబాటి ఒకడు. మొదటి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఈయన నటించిన లెటెస్ట్ చిత్రం ‘విరాటపర్వం’. గతేడాది ప్రథమార్థంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే కారోనా కారణంగా వాయిదా పడ్డ సినిమాలన్ని విడుదలై మంచి విజయాలను సాధించాయి. కానీ విరాట పర్వం మాత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేకపోయింది. ఒకనొక సమయంలో ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మేకర్స్ ఈ పుకార్లకు చెక్ పెడుతూ బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
‘నీది నాది ఒకే కథ’ వంటి వినూత్న సినిమాను తెరకెక్కించి గొప్ప ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. గతేడాది విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను నమోదు చేశాయి. అయితే గత కొన్ని నెలల నుంచి ఈ చిత్రంపై ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో చాలా వరకు ప్రేక్షకులు ఈ సినిమా ఉందనే విషయమే మర్చిపోయారు. ఈ క్రమంలో మేకర్స్ విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు. ఈ చిత్ర విడుదల తేదీని శుక్రవారం సాయంత్రం 5గంటలకు ప్రకటించనున్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణలో 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో నటించాడు. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.
The most awaited announcement is here 🤘
Unveiling #VirataParvam Grand Release Date Today at 5 PM 🔥@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @dancinemaniac @laharimusic @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/KX3nV39sH9
— v e n u u d u g u l a (@venuudugulafilm) May 6, 2022