‘విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ ప్రయాణం సాగిస్తున్న రానా తప్పకుండా విజయం సాధిస్తాడని, ఈ సినిమాలో నటనకు సాయి పల్లవికి జాతీయ ఆవార్డ్ వస్తుందని’ అన్నారు హీరో వెంకటేష్. ఆయన అతిథిగా ‘విరాటపర్వం’ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. రానా, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతున్నది. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్ వీసీ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ప్రీ రిలీజ్ కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ…’నేను ‘విరాటపర్వం’ లాంటి చిత్రాలను తెలుగు తెరపై చూసేందుకు ఇష్టపడతాను. రానా తన మొదటి సినిమా ‘లీడర్’ నుంచి ఇప్పటిదాకా ప్రతి సినిమాలో పూర్తి ప్రయత్నంతో నటిస్తూ వస్తున్నాడు.
ప్రతి పాత్రకు న్యాయం చేయాలని శ్రమిస్తాడు. ఈ ప్రయాణంలో అతను తప్పకుండా విజయం సాధిస్తాడు. వేణు ఊడుగుల ద్వారా మనకొక మంచి దర్శకుడు దొరికాడు. ఈ కథను అతను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ఇదొక అందమైన సినిమా. మీ మనసులు గెలిచే సినిమా. ఇందులో నటనకు సాయి పల్లవికి జాతీయ అవార్డ్ వస్తుంది’ అన్నారు. రానా మాట్లాడుతూ…’భయంకరమైన పరిస్థితుల మధ్య పుట్టిన అందమైన ప్రేమ కథ ఇది. దర్శకుడు నిజాయితీగా చిత్ర రూపకల్పన చేశారు. సాయి పల్లవి లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. సుధాకర్, శ్రీకాంత్ లాంటి అభిరుచి గల నిర్మాతల వల్లే ఈ సినిమా సాధ్యమైంది. ప్రధాన పాత్రల్లో ఎక్కువ శాతం మహిళలే నటించారు. ఇది మహిళల సినిమా. కమర్షియల్ సినిమాలు చేయమని నా అభిమానులు కోరుతుంటారు.
ఇక నుంచి ప్రయోగాలు ఆపేసి వారికి నచ్చే సినిమాల్లోనే నటిస్తాను’ అన్నారు. సాయి పల్లవి మాట్లాడుతూ…’మా మనసులకు నచ్చిన సినిమా విరాటపర్వం. సినిమా చూశాక మీకూ అదే అనుభూతి కలుగుతుంది. ఈ కథను నా దగ్గరకు తీసుకొచ్చిన దర్శకుడికి కతజ్ఞతలు. మిగతా నటీనటుల పాత్రలన్నీ అద్భుతంగా ఉంటాయి. మంచి మనసున్న నటుడు రానా. సినిమా తప్పకుండా చూడండి’ అని చెప్పింది. వేణు ఊడుగుల మాట్లాడుతూ…’ఈ సినిమాలో మేము హింసను హీరోయిజంగా చూపించలేదు. మావో సిద్ధాంతాలను ప్రేరేపించలేదు. ప్రేమే దైవమని చెప్పాం. ప్రేమను మించిన ప్రజాస్వామ్యిక విలువ లేదని చూపించాం. మనిషి స్వేచ్ఛలో ప్రేమ ఒక భాగమని పేర్కొన్నాం. ఒకప్పటి ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో పుట్టిన ప్రేమకథను చూపించబోతున్నాం. ఈ సినిమా మీ జీవితాల్లో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, నటులు రాహల్ రామకష్ణ, నవీన్ చంద్ర, దర్శకుడు కిషోర్ తిరుమల తదితరులు పాల్గొన్నారు.