Village Cooking Channel | యూట్యూబ్ స్టార్ ‘విలేజ్ కుకింగ్ ఛానల్’ తాతా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళనాడు ప్రాంతానికి చెందిన ఈ తాత అసలు పేరు ఎం.పెరియతంబి (M. Periyathambi) యూట్యూబ్లో ‘విలేజ్ కుకింగ్ ఛానల్’ పేరుతో నోరూరుంచే వంటలు చేస్తూ కొన్ని లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. పెరియతంబికి ఒక్క భారత్లోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. తాను చేసిన వంటలు తన కోసం కాకుండా అనాథలైన చిన్నపిల్లలకు వడ్డించేవారు. రీసెంట్గా ఈ ఛానల్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా విజిట్ చేసి వారితో కలిసి భోజనం చేశారు. దీని తర్వాత తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ విక్రమ్ (Vikram) సినిమాలో ఈ తాతతో ఏకంగా ఇంటర్వెల్ ఏపిసోడ్ ప్లాన్ చేసి విజయం సాధించాడు. అయితే తాజాగా ఈ తాతా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు.
హార్ట్ డిసీజ్ కారణంగా హాస్పిటల్ చేరిన తాత ప్రస్తుతం కోలుకుంటున్నాడని త్వరలోనే మీ ముందుకు మళ్లీ వస్తాడు అంటూ ‘విలేజ్ కుకింగ్ ఛానల్’ నిర్వహాకులు తెలిపారు. ఇక తాత ఆసుపత్రిలో చేరడని తెలుసుకున్న ఆయన అభిమానులు తాత తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు.
தாத்தா இதய நோய் காரணமாக மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டுள்ளார். அவர் தற்போது நல்ல நிலையில் உள்ளார். உங்கள் அன்புக்கும் ஆதரவுக்கும் நன்றி! Grandpa is admitted to the Hospital due to Heart Disease. He is in good condition now. Thank you for your love and Support! pic.twitter.com/zCotVgS5w8
— Subramanian Velusamy (@vstamilan) March 28, 2024