నాగవర్మ కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘విక్రమ్’. హరిచందన్ దర్శకుడు. దివ్యాసురేష్ కథానాయిక. ఈ నెల 25న విడుదలకానుంది. శనివారం హైదరాబాద్లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమకథకు యాక్షన్, డ్రామాను మేళవించి రూపొందించాం. సామాజిక అడ్డంకులను దాటుకొని ఓ ప్రేమ జంట ఎలా ఏకమయ్యిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేటితరం యువత మనోభావాలకు దర్పణంలా సినిమా ఉంటుంది’ అని తెలిపారు. ‘విక్రమ్ అనే సినీ రచయిత కథ ఇది. ప్రేమపయనంలో అతడికి ఎదురైన పరిణామాలేమిటన్నది థ్రిల్ను పంచుతుంది. తమిళంలో ‘మహావీరన్’ పేరుతో ఈ సినిమాను విడుదలచేస్తున్నాం’ అని నాగవర్మ అన్నారు. ఇందులో తాను విలన్గా నటించినట్లు ఆదిత్య ఓం చెప్పారు.