డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజా షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ నెల 12వ తేదీన టీమ్ అమెరికాకి చేరుకోగా, ప్రస్తుతం పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ చిల్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు.
ప్రస్తుతం పూరీ, విజయ్ దేవరకొండకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా అనన్య పాండే తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. మైక్ టైసన్ కూడా ముఖ్య పాత్రలో సందడి చేయనున్నారు.