రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దేశ వ్యాప్తంగా చాలా పాపులర్. బాహుబలి సినిమాతో అందరికి ఎలా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందో ఈ చిత్రానికి రచయితగా పని చేసిన విజయేంద్ర ప్రసాద్ కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు పని చేస్తున్నారు. ఇటీవల విజయేంద్రప్రసాద్ పలు ఇంటర్వ్యూలలో గుబురు గడ్డంతో కనిపించారు. అందుకు కారణం ఉందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
రచయితలు నటులుగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దిగ్గజ రచయితలు పరుచూరి బ్రదర్స్ పలు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కు కూడా ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చిందట. నరేంద్ర మోదీపై షార్ట్ మూవీ తీయాలనుకునే ఒక యువ ఫిల్మ్ మేకర్ భారత ప్రధాని పాత్రలో నటించడానికి ఈ ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ను సంప్రదించినట్లు తెలిసింది.
ఈ షార్ట్ ఫిలిం ఓటీటీలో ప్రసారం కానుండగా, దీని కోసమే విజయేంద్రప్రసాద్..మోదీలా గడ్డం పెంచుతున్నాడని చెబుతున్నారు.. ఈ ఆఫర్ కు సంబంధించిన చాలా వివరాలు తెలియాల్సి ఉంది. కానీ విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడట. తనకు సంబంధించి వచ్చిన వార్తలని విని నవ్వి ఊరుకున్నట్టు తెలుస్తుంది. విజయేంద్రప్రసాద్ .. ఇతర సినిమాలకు కథలు రాస్తూ తన ఇతర రచనలకు బిజీగా ఉన్నాడు.