Vijay-Rashmika | టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పేర్లు గత కొద్ది రోజులుగా నెట్టింట హాట్ టాపిక్గా మారుతున్నాయి. వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ నడుస్తుందని ప్రచారం జరుగుతున్నా మొన్నటి వరకు స్పందించలేదు. అయితే తాజాగా తమ ప్రేమ, పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తరువాత పెళ్లి వేడుకల సందడి మొదలైంది. ఈ నెల 26న వివాహం జరగనుండగా, వేడుక కోసం ఈ జంట రాజస్థాన్లోని ఉదయ్పూర్కు బయల్దేరింది. ఎయిర్పోర్ట్లో కనిపించిన వీరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయ్ వెంట ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా ఉండడం అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఉదయపూర్ ప్యాలెస్లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా వీరి ప్రేమ, పెళ్లిపై వార్తలు వినిపించినా ఈ జంట స్పందించలేదు. అయితే ఆదివారం సోషల్ మీడియాలో ఒకే పోస్ట్తో పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అభిమానులు ప్రేమగా పిలిచే ‘విరోష్’ పేరునే తమ వివాహానికి శీర్షికగా పెట్టామని పేర్కొన్నారు.
మేము ఏదైనా ప్లాన్ చేసే ముందు… మా కోసం మేం ఎంపిక చేసుకునే ముందు… మా కంటే మీరే ముందున్నారు. మీరు ప్రేమగా పెట్టిన పేరు ‘విరోష్’. మీ అందరి ఆశీర్వాదాలతో జంటగా మీ ముందుకు వస్తున్నాం. ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’” అంటూ ఎమోషనల్గా రాసుకొచ్చారు. ఉదయపూర్లో పెళ్లి అనంతరం మార్చి 4న హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని ఓ లగ్జరీ హోటల్లో వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని సమాచారం. లఅభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ కలల కపుల్ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో మరింత సందడి చేయనుంది.
My Love’s #Virosh off to Udaipur 🧿❤️#VijayDeverakonda #RashmikaMandanna https://t.co/ulGiA8a4aP pic.twitter.com/3hkfonAYX9
— Pavan Kumar (@pavankumar__123) February 23, 2026