‘జెర్సీ’ సినిమాతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు గౌతమ్ తిన్ననూరి. నాని హీరోగా నటించిన ఈ సినిమా బాలీవుడ్లోనూ రీమేక్ అయ్యింది. ఈ సినిమా తర్వాత గౌతమ్ పెద్ద హీరోలను అప్రోచ్ అయ్యేంత కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన రామ్చరణ్ హీరోగా ఓ సినిమాకు ప్లాన్ చేశారు. కథ బాగుండటం, దర్శకుడి ప్రతిభ తెలిసిన చరణ్ సినిమా చేసేందుకు అంగీకరించారు. అయితే చరణ్కు అప్పటికున్న ప్రాజెక్ట్స్ వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా రామ్చరణ్ దగ్గర నుంచి విజయ్ దేవరకొండకు వెళ్లినట్లు సమాచారం. దర్శకుడి కెరీర్ దృష్టిలో పెట్టుకుని ఈ సలహా రామ్చరణ్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. దీంతో ఇదే కథతో గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండతో సినిమా రూపొందించబోతున్నారట. ప్రస్తుతం రామ్చరణ్.. శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఖుషి’ సినిమా చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్నారు.