Kushi Movie | ‘అర్జున్ రెడ్డి’తో యమ క్రేజ్ తెచ్చుకున్న విజయ్కు ఆ వెంటనే ‘గీతాగోవిందం’ ఫ్యామిలీ ఆడియెన్స్లో ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ రెండు సినిమాల క్రేజ్తో మిక్స్డ్టాక్ తెచ్చుకున్న ‘టాక్సివాలా’ సైతం బ్లాక్బస్టర్ విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ పర్వాలేదనిపించనా.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’లు విజయ్ను కోలుకోలేని దెబ్బ తీశాయి. అప్పటివరకు తెచ్చుకున్న క్రేజ్ మొత్తం ఈ రెండు సినిమాలతో కనబడకుండా పోయింది. పైగా లైగర్ రిలీజ్ టైమ్లో విజయ్ చేసిన హడావిడితో ట్రోలర్ ప్రియులకు టార్గెట్ అయిపోయాడు.
ఇవన్నీ పక్కన పెడితే లైగర్ వచ్చి దాదాపు అర్ధ సంవత్సరం అవుతుంది. అయినా ఇంకా నెక్ట్స్ సినిమా పూర్తి కాలేదు. ప్రస్తుతం విజయ్, శివనిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషీ’ సినిమా చేస్తున్నాడు. గతేడాది జూన్లో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం రెండు షెడ్యూల్స్ను మాత్రమే పూర్తి చేసుకుంది. దానికి ముఖ్య కారణం సమంత. గత ఏడెనిమిది నెలలుగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలో సామ్ షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇచ్చింది. దాంతో ఖుషీ షూటింగ్కు కూడా బ్రేకులు పడ్డాయి. ఎందుకంటే ఈ సినిమాలో విజయ్కు సమానంగా సామ్ పాత్ర ఉండనుందట. ‘అఆ!’ తర్వాత సామ్కు అత్యధిక నిడివి దక్కిన పాత్ర కూడా ఇదేనట.
ఈ క్రమంలో సామ్ ఆరోగ్యం కుదుటపడేవరకు షూటింగ్కు బ్రేక్ ఇవ్వాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. అయితే ఈ లోపు సోషల్ మీడియాలో తెగ నెగెటీవిటీ స్ప్రెడ్ అయిపోయింది. ఖుషీ సినిమా కాన్సిల్ అయిందని. శివ నిర్వాణ వేరే ప్రాజెక్ట్కు వెళ్లిపోయాడు. విజయ్ ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరి సినిమాను స్టార్ట్ చేయడంలో బిజీ అయిపోయాడని బోలెడు వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్స్ అంటూ చిత్రబృందం ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చిన ప్రేక్షకులు నమ్మలేరు.
కాగా తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహద్ చేసిన పోస్ట్తో ఖుషీ సినిమాపై ఆశలు చిగురించాయి. సినిమా షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానున్నట్లు స్పష్టమైంది.హేషమ్ ఇన్స్టాగ్రామ్లో ‘మళ్లీ స్టార్ట్ చేయడానికి అంతా సిద్ధం. ఖుషీ పాటలు బయటకు వచ్చేంత వరకు వేచి ఉండలేను. మీ బ్లెస్లింగ్స్ కావాలి’ అంటూ విజయ్, శివనిర్వాణతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. దాంతో ఈ సినిమా త్వరలోనే తిరిగి పట్టాలెక్కుతున్నట్లు క్లారిటీ వచ్చేసింది.
రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్లుక్ పోస్టర్ సినిమాపై కాస్త అంచనాలు పెంచాయి. కాశ్మీర్ బ్యాక్గ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.