Liger Movie Completes Censor Board | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘లైగర్’ ఒకటి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే చిత్రబృందం ఇండియా టూర్ పేరుతో మెయిన్ సిటీస్లో భారీ మొత్తంలో ప్రమోషన్లను జరుపుతున్నారు. విజయ్, అనన్య పాండే జనాల మధ్యలోకి వెళ్ళి సినిమాను ప్రమోట్ చేస్తూ లైగర్పై మంచి బజ్ తీసుకొచ్చారు. వెళ్ళిన ప్రతి చోట విజయ్కు అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో లైగర్ బృందం జరిపినన్ని ప్రమోషన్లు ఏ చిత్రబృందం కూడా జరుపలేదు. ప్రస్తుతం ఇండియా వైడ్గా లైగర్కు విపరీతమైన బజ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా లైగర్ చిత్రానికి సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చింది.
తాజాగా లైగర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ యూ ఏ సర్టిఫికేట్ జారి చేసింది. ఇక రన్ టైం 2 గంటల 20 నిమిషాలు ఉండనుందట. అయితే తాజాగా లైగర్కు సెన్సార్ ఏడు కట్స్ చెప్పింది. ఎఫ్తో మొదలయ్యే అసభ్యపదాల్ని చాలా చోట్ల ఉపయోగించారని.. వాటిన మ్యూట్ చేయమని చెప్పింది. కొన్ని సీన్లలో నటీనటులు సైగలతో చేసే కొన్ని సన్నివేశాలు అసభ్యంగా ఉన్నాయని, వాటిని బ్లర్ చేయమన్నది. అలాగే విజయ్ చేతులతో సంజ్ఞ చేసే సీన్ను పూర్తిగా తొలగించమని సూచించింది. ముఖ్యంగా ఏడు సన్నివేశాలను మార్పులు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డ్ ఆదేశాలను జారి చేసింది.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో విజయ్కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటిస్తుంది. కరణ్జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.