విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషీ’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతున్నది. ఈ సందర్భంగా అక్కడి హోటల్లో విజయ్ దేవరకొండతో లంచ్ చేస్తూ తీయించుకున్న ఓ ఫొటోను సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని, అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కొందరు మాత్రం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండిపోతారని అంటూ ఫొటోకు క్యాప్షన్ను జత చేసింది.
ప్రస్తుతం ఈ ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారింది. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీశర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.మురళి, సంగీతం: హిషా మ్ అబ్దుల్ వాహబ్, రచనా సహకారం: నరేష్ బాబు.పి, సీఈఓ: చెర్రీ, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ.