ఇటీవల విడుదలైన ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా తదుపరి సినిమాల కోసం సన్నద్ధమవుతున్నారు హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ అగ్ర నిర్మాత దిల్ రాజు సంస్థలో ఓ సినిమా చేయాల్సి ఉంది.
అయితే ఈ చిత్రానికి దర్శకుడెవరనేది ఇంకా ఖరారు కాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దిల్రాజు..హరీష్శంకర్కు నిర్దేశక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ రూపకల్పనలో హరీష్శంకర్ నిమగ్నమయ్యారని సమాచారం. విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఖుషి’ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నది. అది పూర్తయిన వెంటనే హరీష్శంకర్ సినిమా పట్టాలెక్కుతుందని చెబుతున్నారు. గతంలో దిల్రాజు బ్యానర్లో రామయ్య వస్తావయ్యా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథమ్ వంటి సినిమాల్ని తెరకెక్కించారు హరీష్శంకర్.