విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్ కథానాయిక. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే యాభైశాతం చిత్రీకరణ పూర్తయిందని, సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
త్వరలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ను విడుదల చేయబోతున్నారు. ‘గీత గోవిందం’ తరహాలోనే కుటుంబ భావోద్వేగాలు, వినోదం ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘ఫ్యామిలీస్టార్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేయూ మోహన్, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, రచన-దర్శకత్వం: పరశురామ్.