రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఒకవైపు నటుడిగా రాణిస్తూనే మరోవైపు బిజినెస్లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ స్టార్ట్ చేసి, సూపర్ బ్రాండ్గా మార్చుకున్నాడు. తాజాగా మల్లీప్లెక్స్ బిజినెస్లోకి అడుగుపెట్టబోతున్నట్టు స్వయంగా ప్రకటించాడు. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్తో కలిసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు.
ఏవీడీ సినిమాస్ పేరుతో మల్లీ ప్లెక్స్ థియేటర్ని తన స్వస్థలమైన మహాబూబ్నగర్లో ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు విజయ్ దేవరకొండ. లవ్స్టోరీ సినిమాతో ఈ థియేటర్ ప్రారంభం కానుందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం లైగర్ షూటింగ్ నిమిత్తం గోవాలో ఉన్న కారణంగా లాంచింగ్ కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోతున్నానని అన్నాడు విజయ్.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్నారు. ఛార్మీ, కరణ్ జోహార్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత విజయ్.. సుకుమార్తో సినిమా చేయనున్నట్టు సమాచారం.
From dreaming of becoming an Actor to now owning my own Multiplex Cinema 😊
— Vijay Deverakonda TOOFAN (@TheDeverakonda) September 19, 2021
I share with you all,
Asian Vijay Deverakonda cinemas 🤗
The 1st AVD will officially open in Mahbubnagar, from September 24th 2021. https://t.co/rv5l22B16U