తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు పరశురాం (Parasuram). గీతగోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు సాలిడ్ కమర్షియల్ సక్సెస్ అందించాడు. సింపుల్ కథతో మ్యాజిక్ చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ సినిమా నిర్మాతలకు కాసులు కురిపించడమే కాదు.. పెళ్లిచూపులు తర్వాత విజయ్ దేవరకొండను ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గర చేసింది. రష్మిక మందన్నాకు కూడా ఛలో సినిమా తర్వాత టాలీవుడ్లో మంచి బ్రేక్ అందించింది.
గీతగోవిందం (Geeta Govindam) క్రేజీ కాంబినేషన్ మళ్లీ రాబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురాం మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్లో ఓ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పరశురాం మరోవైపు బాలకృష్ణతో కూడా సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడన్న వార్తలు ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తుండగా.. ఈ సినిమాకు టైం పట్టనుందట.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో సినిమాకు ప్లాన్ చేయాలని పరశురాం అనుకుంటున్నట్టు జోరుగా టాక్ నడుస్తోంది. గీతగోవిందం క్రేజీ కాంబినేషన్కు ముహూర్తం కుదురుతుందా..? లేదా..? అనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఖుషీ సినిమాతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తెలుగులో కొత్త సినిమాకు సంతకం చేయలేదు. లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత పూరీ జగన్నాథ్తో విజయ్ దేవరకొండ చేయనున్న జేజీఎం (జనగణమన) సస్పెన్స్లో పడ్డది.