విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వ క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ-పరశురామ్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ వెలువడింది. ఈ నెల 18న ఈ సినిమా టైటిల్ను ప్రకటించనున్నారు. ఈ సినిమాకు ‘ఫ్యామిలీ స్టార్’ అనే టైటిల్ను ఖరారు చేయబోతున్నారని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. దాదాపు అదే టైటిల్ను ఖరారు చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, నిర్మాతలు: రాజు-శిరీష్, రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల.