ప్రేమకథల్లో చక్కగా ఒదిగిపోతాడు అగ్రహీరో విజయ్ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’ ‘అర్జున్రెడ్డి’ ‘గీత గోవిందం’ సినిమాలన్నీ ప్రేమకథాంశాలతో తెరకెక్కి అద్భుత విజయాల్ని దక్కించుకున్నాయి. గత కొంతకాలంగా యాక్షన్ బాటలో సాగుతున్న విజయ్ దేవరకొండ తాజాగా పూర్తిస్థాయి ప్రేమకథకు శ్రీకారం చుట్టారు. ఆయన కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూపొందిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. సమంత కథానాయికగా నటిస్తున్నది. వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్శంకర్ క్లాప్నివ్వగా, ‘ఉప్పెన’ బుచ్చిబాబు కెమెరా స్విఛాన్ చేశారు.
“నిన్నుకోరి’ ‘మజిలీ’ వంటి ప్రేమకథల్ని తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకు కూడా హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ఓ లవ్స్టోరీని సిద్ధం చేశారు. కశ్మీర్ నేపథ్యంలో కథ నడుస్తుంది. రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే కశ్మీర్లో మొదలవుతుంది. అక్కడి షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైదరాబాద్, విశాఖపట్నం, అలెప్పిలో మిగతా షూటింగ్ జరుపుతాం’ అని చిత్రబృందం పేర్కొంది. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీశర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి.మురళి, ఎడిటర్: ప్రవీణ్పూడి, ఫైట్స్: పీటర్హెయిన్, ఆర్ట్: ఉత్తర కుమార్, చంద్రిక, సంగీతం: హిషామ్ అబ్దుల్ వాహబ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దినేష్ నరసింహన్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ.