విజయ్ దేవకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమాకు సంబంధించి ఓ శుభవార్త అందించారు దర్శకుడు శివ నిర్వాణ. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురావాల్సి ఉంది. అయితే కథానాయిక సమంత అనారోగ్య కారణాల వల్ల షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. ‘లైగర్’ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాపై ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా సగభాగం మిగిలి ఉండటంతో విడుదల తేదీ విషయంలో స్పష్టత లేకుండా పోయింది.
ఈ సినిమా షూటింగ్ను త్వరలో పునః ప్రారంభించబోతున్నామని దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదొక అందమైన ప్రయాణంగా మిగిలిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కశ్మీర్ నేపథ్య ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత తిరిగి సెట్స్లోకి అడుగుపెట్టడం శుభ పరిణామమని ఆమె అభిమానులు అంటున్నారు. ఈ వేసవిలోనే ఈ సినిమాను విడుదల చేసే అవకాశముందని సమాచారం.