‘గీత గోవిందం’ చిత్రంతో అగ్ర హీరో విజయ్ దేవరకొండకు భారీ హిట్ చిత్రాన్ని అందించారు దర్శకుడు పరశురామ్. వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రకటన వెలువడింది. తాజా సమాచారం ప్రకారం మే 1న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిసింది. అదే వారంలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుందని అంటున్నారు.
‘గీత గోవిందం’ తరహాలోనే చక్కటి ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.