విజయ్దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురావాల్సి ఉంది. ఇటీవల నాయిక సమంత అనారోగ్యం బారిన పడి చికిత్స తీసుకుంటున్నందున షూటింగ్కు బ్రేక్ పడింది. దాంతో సినిమా విడుదల రెండు నెలలు ఆలస్యం కానుందని తెలిసింది. ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘అరవైశాతం చిత్రీకరణ పూర్తయింది. డిసెంబర్లో రిలీజ్ ప్లాన్ చేశాం.
అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరిలో విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నాం’ అని విజయ్ దేవరకొండ చెప్పారు. కశ్మీర్ నేపథ్య ప్రేమ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నది.