విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘జన గణ మన’. ఈ సినిమాలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నది. పూరి కనెక్ట్స్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై చార్మి కౌర్, వంశీ పైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా యాక్షన్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కనుందీ సినిమా. ఈ చిత్ర షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ముంబైలో తొలి షెడ్యూల్ చిత్రీకరణను మొదలుపెట్టారు. పలు అంతర్జాతీయ లొకేషన్లలో సినిమా షూటింగ్ జరుపుతామని టీమ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఆగస్టు 3న ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.