Raththam Trailer | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటిస్తున్న తాజా చిత్రం రత్తం (Raththam). ఈ చిత్రాన్ని డేట్స్ ఖాళీ లేకపోవడంతో మొదట అక్టోబర్, లేదా నవంబర్లో విడుదల చేద్దామనుకుంది చిత్రబృందం. కానీ ప్రభాస్ సలార్ (Prabhas Salaar) విడుదల తేదీ వాయిదా పడడంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది.
ఈ ట్రైలర్ను గమనిస్తే.. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. చెన్నైలో విధ్వంసం సృష్టించే వరుస హత్యల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ దారుణ హత్యలు వల్ల రాష్ట్ర మంత్రులు రాజీనామాకు దారితీసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ట్రైలర్లో చూడవచ్చు. ఇక మీడియా, న్యాయవ్యవస్థ మధ్య ఉన్న అనుబంధం ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మిగిలిన కథ.
Watch and enjoy the trailer of #Ratham 😊 https://t.co/yOXswidw07
— vijayantony (@vijayantony) September 9, 2023
ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ నిర్మించిన ఈ సినిమాలో నందితా శ్వేత జర్నలిస్ట్ పాత్రలో కనిపించగా.. మహిమా నంబియార్, రమ్య నంబిసన్, ఉదయ్ మహేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.