Vignesh Shivan | ప్రముఖ కథానాయిక నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ గత సంవత్సరం ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారి పెళ్లి జరిగి ఈ శుక్రవారంతో ఏడాది పూర్తిచేసుకుంది. వారి తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన ఫ్యామిలీని ఉద్దేశిస్తూ దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ పోస్ట్కు వాళ్ల పిల్లల ఫోటోలను కూడా షేర్ చేశారు. ‘నువ్వు నా లైఫ్లోకి వచ్చి అప్పుడే ఏడాది పూర్తయిందంటే నమ్మలేకపోతున్నాను. ఎన్నో ఒడిదొడుకులు, సమస్యలు ఎదురయ్యాయి.
ఎన్ని ఒత్తిడులు వున్నా ఒక్కసారి నీతో పాటు పిల్లల్ని చూడగానే అన్నీ మర్చిపోతాను. ఎంతో సంతోషంగా ఆనందంగా వుంటుంది ఆ క్షణాల్లో.. మిమ్మల్ని అలా చూడగానే నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబం ఇచ్చే బలం మరేది ఇవ్వలేదని నమ్ముతాను. మన పిల్లలు ఉయిర్, ఉలగమ్లకు మంచి లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నిన్న మొన్ననే మన పెళ్లి జరిగినట్లుగా అనిపిస్తుంది. మన అందమైన జీవితంలో మరో సంవత్సరానికి స్వాగతం పలుకుదాం’ అంటూ నయనతారకు పోస్ట్ రూపంలో తన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు విఘ్నేష్ శివన్.