కోలీవుడ్ క్రేజీ కపుల్స్లో నయనతార- విఘ్నేష్ శివన్ జంట ఒకటి. కొన్నాళ్లుగా కలిసి చెట్టా పట్టాలేస్తున్న ఈ జంట పెళ్లికి మాత్రం చాలా దూరంగా ఉంటున్నారు.అయితే వీరు ఎక్కడికి వెళ్లినా.. కెమెరా కళ్లన్ని వాళ్లపైనే ఉంటాయి. అనేకసార్లు కలిసి కనిపించిన ఈ జంటని పెళ్లి గురించి ప్రశ్నిస్తే అందుకు ఎలాంటి స్పందన వచ్చేది కాదు.
ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న లవ్బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్లు ఇటీవల సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఓ టీవీ షోకు హజరైన నయన్ వెల్లడించింది. లాక్డౌన్లో కొద్దిమంది కుటుంబ సభ్యులు మధ్య ఎంగేజ్మెంట్ వేడుక జరిగినట్లు తెలిపింది. అయితే త్వరలోనే పెళ్లి కూడా జరగనున్నట్లు స్పష్టం చేసింది.
పెళ్లి విషయంలో ఎలాంటి దాపరికం లేకుండా అందరిని ఆహ్వానిస్తానని చెప్పుకొచ్చింది నయనతార.అయితే నయనతారని విఘ్నేష్ శివన్ ప్రేమగా తంగమ్ (బంగారం) అని పిలుస్తారట. ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు. ప్రస్తుతం నయనతార..విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న చిత్రంలో సమంత, విజయ్ సేతుపతితో కలిసి నటిస్తుంది. ఇప్పుడు నయనతార తన మాతృభాష మలయాళంలో చేయనున్న తాజా సినిమాకు ‘గోల్డ్’ (బంగారం) అనే టైటిల్ ఖరారైంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.