కోల్కతా : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ బెంగాలీ దర్శకుడు తరుణ్ మజుందార్ (92) సోమవారం ఉదయం కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతూ ఆయన తుదిశ్వాసం విడిచారు. తన సినిమాల్లో మధ్య తరగతి జీవితాలను తరుణ్ మజుందార్ హృద్యంగా ఆవిష్కరించారు.
ఆయన గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కోల్కతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మజుందార్ భార్య సంధ్యా రాయ్ పలు సినిమాల్లో నటిగా రాణించారు. 1960, 70,80 దశకాల్లో బెంగాలీ సినిమా ప్రతిష్టను ఆయన తన సినిమాలతో ఇనుమడింపచేశారు.
తరుణ్ మజుందార్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన స్మృతి టుకు ధక్, శ్రీమాన్ పృధ్వీరాజ్, కుహెలి, బాలికా వధు, దాదర్ కీర్తి వంటి బెంగాలీ సినిమాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. 1990లో తరుణ్ మజుందార్కు పద్మశ్రీ అవార్డు లభించగా పలు జాతీయ అవార్డులు సహా ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి.