ధనుష్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. జి.శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మాతలు. ఈ నెల 12న తమిళనాట విడుదలైన ఈ చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తున్నది. ఈ నెల 25న తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని ఏషియన్ మల్టీఫ్లెక్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. ఈ చిత్ర ట్రైలర్ను అగ్ర హీరోలు నాగార్జున, వెంకటేష్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా విడుదల చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం నడిచే ఈ కథలో ధనుష్ను కెప్టెన్ మిల్లర్గా పరిచయం చేశారు. తన గ్రామాన్ని దోచుకోవడానికి ప్రయత్నించే వలసవాదులను తరిమికొట్టడానికి కెప్టెన్ మిల్లర్ చేసే పోరాటం ఆకట్టుకుంది. ధనుష్ విభిన్న అవతారాల్లో కనిపించారు. యాక్షన్ ఘట్టాలు రొమాంచితంగా సాగాయి. విజువల్స్ మరో స్థా యిలో కనిపించాయి. యాక్షన్, దేశభక్తి అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నుని, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థ: సత్యజ్యోతి ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్.