సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ‘కరుప్పు’.. ‘వీరభద్రుడు’ పేరుతో తెలుగులో అనువాదమవుతున్నది. ఆర్జే బాలాజీ దర్శకుడు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ఉభయ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నది. ఈ చిత్రంలో సామాన్యుల తరపున పోరాటం చేసే న్యాయవాది పాత్రలో సూర్య కనిపించనున్నారు. సామాజిక అంశాలతో పాటు డివోషనల్ టచ్తో కూడుకున్న ఈ కాన్సెప్ట్లో థ్రిల్లింగ్ అంశాలుంటాయని మేకర్స్ చెబుతున్నారు.
వీరభద్రుడిగా సూర్య నట విశ్వరూపం ప్రదర్శించాడని, దుష్ట శిక్షణ కోసం ఆయన ఎలాంటి మార్గాన్ని అనుసరించాడన్నది ఆసక్తికరంగా ఉంటుందని, యాక్షన్ సీక్వెన్సెస్ ప్రధానాకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. త్రిష, ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ, మాయ రవి, సుప్రీత్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయిఅభ్యంకర్, నిర్మాతలు: ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు, రచన-దర్శకత్వం: ఆర్జే బాలాజీ.