Nandamuri Balakrishna | ఎప్పుడెప్పుడా అని అటు నందమూరి అభిమానులు, ఇటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన ‘వీరసింహా రెడ్డి’ గురువారం పెద్ద ఎత్తున రిలీజైంది. ఇక రిలీజైన మొదటి షో నుండి అన్ని చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులలు పడిపోయాయి. ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ, ‘క్రాక్’ వంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత గోపిచంద్ మలినేని.. ఇద్దరు కలిసి రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. దానితో పాటుగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల నడుమ గురువారం రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. కానీ టాక్తో సంబంధంలేకుండా ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రాబట్టింది.
ఈ సినిమా మొదటి రోజే రూ.29 కోట్ల షేర్ను సాధించి సంచలనం సృష్టించింది. బాలయ్య కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిని మూవీగా నిలిచింది. అంతేకాకుండా ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’ తర్వాత అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. రెండవ రోజు కూడా బుకింగ్స్ భారీ రేంజ్లో ఉన్నాయి. ఇలానే కంటిన్యూ అయితే మరో వారం రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్స్ ఉంది. అయితే నేడు వాల్తేరు ‘వీరయ్య రిలీజై’ మంచి టాక్ తెచ్చుకుంది. దాంతో వీరసింహుడుపై కలెక్షన్ల ప్రభావం పడే చాన్స్ ఉంది. అంతేకాకుండా శనివారం ‘వారసుడు’ కూడా రిలీజ్ కానుంది. దాంతో థియేటర్ కౌంట్ చాలా వరకు తగ్గనుంది. చూడాలి మరి ఈ సంక్రాంతికి ఎవరు పైచేయి సాధిస్తారో అని.