Veera Simha Reddy Making Video | ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత ‘వీర సింహా రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘క్రాక్’ ఫేం గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ‘క్రాక్’ వంటి భారీ విజయం తర్వాత గోపిచంద్ మలినేని, బాలయ్యతో సినిమా చేయనుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.
లేటెస్ట్గా రిలీజైన మేకింగ్ వీడియో గూస్బంప్స్ తెప్పిస్తుంది. బాలయ్య యాక్షన్ సన్నివేశాలు, షూటింగ్ సెట్స్, గుడి విజువల్స్ను ఈ వీడియోలో చూపించారు. కాగా గుడి దగ్గర సన్నివేశం సినిమాకే హైలేట్ కానున్నట్లు వీడియో చూస్తే తెలుస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ సంస్థ నిర్మించింది. బాలయ్య ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నాడు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాకు పోటీగా రిలీజవుతున్న ‘వాల్తేరు వీరయ్య’ను కూడా మైత్రీ సంస్థే నిర్మించింది. ఇన్నేళ్ళ సినీ ఇండస్ట్రీలో మొట్ట మొదటి సారిగా ఒకే బ్యానర్లో తెరకెక్కిన సినిమాలు ఒకటి, రెండు రోజుల గ్యాప్లో రిలీజవడం ఇదే తొలి సారి. మరీ మైత్రీకి ఈ రెండు సినిమాలు కలిసి వస్తాయో లేదో చూడాలి.