ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ అనే చిత్రంలో నటిస్తున్నారు వరుణ్తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈ సినిమాతో పాటు సోనీ పిక్చర్స్ సంస్థ ఏవియేషన్ నేపథ్యంలో రూపొందిస్తున్న సినిమా కూడా షూటింగ్ను జరుపుకుంటున్నది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్తో బిజీగా ఉన్న వరుణ్తేజ్ మరో భారీ చిత్రానికి అంగీకరించారని తెలిసింది.
‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్తేజ్ తన తాజా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. 80దశకం నేపథ్యంలో సాగే కథాంశమిదని, ఈ సినిమాలో వరుణ్తేజ్ పాత్ర పరంగా పూర్తి మేకోవర్తో కనిపిస్తారని అంటున్నారు.