హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వన్ వే టికెట్’. ఏ.పళని స్వామి దర్శకత్వంలో జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓపెనింగ్ ఆదివారం హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, అగ్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాతలు హర్షిత్ రెడ్డి, టి.ఎస్.రావు స్క్రిప్ట్ని మేకర్స్కి అందించారు. సినిమా బాగా రావాలని, ఘన విజయం సాధించాలని అతిథులంతా ఆకాక్షించారు.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ‘ టైటిల్ లాగానే కథ కూడా కొత్తగా ఉంటుంది. ఇందులో విభిన్నమైన పాత్రలో కనిపిస్తా. త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నాం. తప్పకుండా అందరూ మెచ్చేలా సినిమా తెరకెక్కుతుందని నమ్మకంతో ఉన్నా’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది ఓ క్రైమ్ థ్రిల్లర్ అని, వరుణ్ సందేశ్ కెరీర్లో ఓ మైలురాయిలా ఈ సినిమా నిలుస్తుందని దర్శకుడు పళనిస్వామి నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత శ్రీనివాసరావు, కథానాయిక కుష్బూ చౌదరి, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నటులు మనోజ్, సుధాకర్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ బెజుగమ్, నిర్మాణం: శ్రీపద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్.