వరుణ్సందేశ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఎమ్ 3 మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీఅద్యాన్త్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్సందేశ్ క్లాప్నిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఇప్పటివరకు తాను నటించిన సినిమాలకు పూర్తి భిన్నమైన కథాంశమిదని అన్నారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ ఇదని. వరుణ్సందేశ్ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు అద్యాన్త్ హర్ష తెలిపారు. రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అజయ్కుమార్, కథ, దర్శకత్వం: అద్యాన్త్ హర్ష.