Burj Khalifa | బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘భేదియా’. కామెడీ హార్రర్నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అమర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా ‘భేదియా’ను ‘తోడేలు’గా తెలుగులో విడుదల చేస్తున్నారు. నవంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రొమోషన్స్లో బిజీగా ఉంది.
సినిమా ప్రొమోషన్స్కోసం చిత్ర యూనిట్ ఇటీవల దుబాయ్ వెళ్లింది. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బూర్జ్ ఖలీఫాపై ‘భేదియా’ ట్రైలర్ను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కృతి సనన్, వరుణ్ ధావన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.