సాయిపవన్, ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రం ‘వారెవ్వా జతగాళ్లు’. సత్య సలాది దర్శకుడు. ఈ నెల 22న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘తమిళనాడులో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిం చాం. ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా నిరంకుశత్వం రాజ్యమేలుతున్న గ్రామంలో నలుగురు యువకులు చేసిన పోరాటం ఎలాంటి ఫలితాలను ఇచ్చిందన్నదే కథాంశం.
ప్రేమకథతో పాటు ఎమోషనల్ అంశాలుంటాయి’ అన్నారు. పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ గుండు మురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిసాగర్, సంగీతం: సంతోష్ ఎమ్, నిర్మాతలు: బండారు నాగరాజు, వీర ప్రభాకర్, గంగ వీరబాబు.