Varalaxmi Sarathkumar | సీనియర్ హీరో శరత్ కుమార్ నట వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మీ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్య కథలను ఎంచుకుని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన యశోద మూవీలో వరలక్ష్మీ నటించారు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు ఆమె.
అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిన్నటికి పదేండ్లు పూర్తయిన సందర్భంగా.. వరలక్ష్మీ భావోద్వేగంతో కూడిన పోస్టు పెట్టారు. పదేండ్ల క్రితం ఇదే రోజు తన మొదటి సినిమా విడుదలైందని గుర్తు చేశారు. తాజాగా విడుదలైన యశోద చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ దశాబ్ద కాలం తన ప్రయాణం సులభంగా, అనుకున్న విధంగా సాగిందా అంటే.. కాదనే చెప్పాలన్నారు. ఈ పదేండ్ల కాలంలో ఎన్నో తిరస్కరణలకు గురవుతూనే.. ఎన్నో విలువైన విషయాలను నేర్చుకున్నాని వరలక్ష్మీ చెప్పుకొచ్చారు. 45 సినిమాల్లో నటించి నేనెంటో నిరూపించుకునే తనకు అవకాశం ఇచ్చారన్నారు. అలాగే తనను తిరస్కరించిన ప్రతి ఒక్కరికీ ధన్యావాలు తెలిపారు వరలక్ష్మీ. తనకు మద్దతు ఇస్తూ కష్టకాలంలో అండగా నిలిచిన దర్శక నిర్మాతలకు, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.