‘చెన్నైలో ఈ నెల 10న మీడియా వారికి ఈ సినిమా షో వేశాం. వారు బాగుందని ప్రశంసిస్తూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు’ అని అన్నారు దిల్ రాజు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా పతాకాలపై ఆయన నిర్మించిన చిత్రం ‘వారసుడు’. దళపతి విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 14న తెలుగులో విడుదలకానుంది. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో దిల్రాజు మాట్లాడుతూ ‘ఈ సినిమా పాయింట్ చెప్పినప్పుడే బాగా నచ్చింది. ప్రతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది.
ఈ రోజు మీ దిల్రాజు, వంశీ తమిళంలోకి వెళ్లి ఓ బ్లాక్బస్టర్ హిట్ కొట్టి ఇక్కడకొచ్చాం. ఇది సాధారణ విషయం కాదు. ఈ రోజు చాలా గర్వంగా ఉంది. సక్సెస్ అంటే డబ్బే కాదు. దానితో వచ్చే ఎమోషన్ ముఖ్యం. తమిళంలో ఆల్రెడీ విజయం సాధించిన సినిమాతో మీ ముందుకొస్తున్నాం. ఇక్కడ కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నా’ అన్నారు. మనం ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన వెంట ఉండేది కేవలం ఫ్యామిలీ మాత్రమే అనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టిందని, విజయ్ సింగిల్ సిట్టింగ్లోనే కథ ఓకే చేశారని వంశీ పైడిపల్లి తెలిపారు.