Urvashi-Nawazuddin | బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, నటి ఊర్వశి రౌటెలాలకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసులు జారీ చేసింది. గేమింగ్ కంపెనీ లోటస్365 కంపెనీకి సంబంధించిన విషయంపై నోటీసులు ఇచ్చింది. ఓ వార్తపత్రికలో ప్రచురితమైన ప్రకటనను పరిగణలోకి సీసీపీఏ.. ఈ మేరకు నోటీసులు జారీ చేస్తూ సమాధానం ఇవ్వాలని కోరింది. కంపెనీతో ఒప్పందం చేసుకునే ముందు.. సదరు కంపెనీ వాదన నిజమని ఎలా నిర్ధారించుకున్నారని ప్రశ్నించింది.
ఏదైనా ఉత్పత్తుల బ్రాండ్ ప్రచారం కోసం సంతకాలు చేసే ముందు శ్రద్ధ వహించాలని వినియోగదారుల మంత్రిత్వ శాఖ సెలెబ్రెటీలకు సూచించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. లేకపోతే రూ.10లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుందని, పునరావృతమైతే రూ.50లక్షల వరకు ఫైన్ వేయనున్నట్లు హెచ్చరించింది. అలాగే ప్రకటనల్లో పాల్గొనకుండా ఎండార్స్మెంట్లపై నిషేధం విధించనున్నట్లు పేర్కొంది.