Upasana | ఈ మధ్య మెగా కోడలు ఉపాసన తెగ వార్తలలో నిలుస్తుంది. బిజినెస్ కార్యక్రమాలు, పర్సనల్ విషయాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్కి ఆనందాన్ని అందిస్తుంది. అయితే తాజాగా ఉపాసన శుభవార్తని షేర్ చేసింది. మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అనే అవార్డ్ దక్కించుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ప్రగ్నెంట్గా ఉన్న నేపథ్యంలో అవార్డ్ తీసుకునేందుకు తాను వెళ్లలేకపోయినట్టు చెప్పుకొచ్చింది. మానసికంగా, శారీరికంగా సానుకూల మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాము. ఈ గుర్తింపు ప్రతి రోజూ మరింత ఎక్కువగా పని చేయడానికి అలానే పరిమితులని అధిగమించడానికి మా అందరిని ప్రేరేపిస్తుంది అని చెబుతూ అవార్డ్తో దిగిన పిక్స్ షేర్ చేసింది ఉప్సీ. ఇక మెగా కోడలి పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా, ఆమెకి శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
మెగా పవర్స్టార్ రామ్చరణ్, ఉపాసన దంపతుల ఇంట మరోసారి శుభవార్త వినిపిస్తోంది. ఇటీవల ఓ వీడియో షేర్ చేయగా ఇందులో దీపావళి సంబరాలతో పాటు ఉపాసనకు సీమంతం నిర్వహించిన దృశ్యాలు కూడా కనిపించడంతో ఆమె మరోసారి గర్భం దాల్చిందన్న వార్తలు బలంగా వినిపించాయి. ముఖ్యంగా “డబుల్” అనే పదాన్ని పదే పదే వాడటంతో ఈసారి కవలలు పుట్టబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అది నిజమే అనే విషయాన్ని ఉపాసన కూడా కన్ఫాం చేసింది. త్వరలో ఉపాసనకి కవలలు జన్మించబోతున్నారు.
ఇక రామ్చరణ్, ఉపాసనలకు 2012లో వివాహం కాగా… 2023 జూన్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘క్లీంకార’ అని నామకరణం చేశారు. ఇప్పటివరకు క్లీంకార ముఖాన్ని ఫ్యామిలీ రివీల్ చేయలేదు. తాజాగా ఉపాసన మరోసారి గర్భం దాల్చినట్లు హింట్ ఇవ్వడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈసారి ‘సింబా’ వస్తాడంటూ కొందరు కామెంట్లు చేసారు. కాగా గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక కార్యక్రమంలో తనకు మనవడు పుట్టాలని కోరికగా ఉందని చెప్పిన విషయం తెలిసిందే. ఇక గతంలో ఉపాసన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండో సంతానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మొదటి బిడ్డ విషయంలో చాలా ఆలస్యం చేశాం. అప్పట్లో వచ్చిన విమర్శలు, ఒత్తిడిని పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలా చేయాలనుకోవడం లేదు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపాసన ప్రగ్నెంట్ కాగా, వచ్చే ఏడాది కవలలకి జన్మనివ్వనుంది.