Kota Srinivasa Rao | ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన కోట శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయన మృతి అభిమానులని శోక సంద్రంలోకి నెట్టింది. కోట మృతి తర్వాత ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ తన సినిమాల్లోని పాత్రలని కథకు అనుగుణంగా అద్భుతంగా డిజైన్ చేసుకునేవారు. అయితే శత్రువు సినిమా చేస్తున్న సమయంలో అందులో ఒక పాత్రని చాలా బాగా రాసుకున్నారట. ముఖ్యంగా ఆ పాత్ర పోషించే వారు డిఫరెంట్ మేనరిజమ్స్ని ప్రదర్శించాలట. ఆయన రాసుకున్న పాత్రని ఎవరు కూడా సరిగ్గా చేయలేకపోతున్నారట.
అప్పటికే ఇద్దరు నటులు మారిపోయారు. కోడి రామకృష్ణ అద్భుతంగా చేసి చూపిస్తున్నా కూడా ఇతరులు చేయలేక లోలోన మథనపడిపోయి సినిమా నుండి తప్పుకున్నారు. అప్పుడు ఈ పాత్ర చేయాలంటే.. ఒక్కడే ఉన్నాడు,అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పగా, ఆసక్తిగా ‘ఎవరు ?’ అని కోడిరామకృష్ణ అడగ్గా కోట పేరు వినిపించింది. అవును, నేను చాలా ముచ్చటపడి రాసుకున్న ఈ పాత్రకి అతనే కరెక్ట్, వెంటనే పిలిపించండి అని కోడి రామకృష్ణ అన్నారు..ఆయన రాగానే సీన్ చెప్పి షూట్ మొదలు పెట్టారు. ఆవేశంతో ఊగిపోతూ డైలాగ్ చెప్పి న కోటకి ‘వన్మోర్’ అనే సౌండ్ వినిపించింది. అలా 17 సార్లు వన్ మోర్ లు అయిపోయాయి. కోట శ్రీనివాసరావు అనే నటుడు ఇన్ని టేకులు తినడం ఇదే మొదటిసారి.
కెమెరామన్ ఎస్.గోపాలరెడ్డి ఇదంతా గమనించి.. ‘కోటయ్యా… ఇలా రా’ అని పక్కకి తీసుకువెళ్లి ‘ఈ క్యారెక్టర్ నువ్వు చెయ్యాలి. నువ్వే చేయగలవు’ అంటూ అతనికి ధైర్యం నూరిపోశారు. ఇంతలో కోడి రామకృష్ణ ‘బ్రేక్’ చెప్పడంతో కోట పక్కకు వెళ్లి కాస్త తీర్థం పుచ్చుకుని వచ్చి సెట్ లో నిలబడ్డారు. అయితే పక్కనున్న నటీమణులు ‘ఏంటి ఈ మందు వాసన ? అని కోట వైపు అనుమానంగా చూడసాగారు. అంతలో యాక్షన్ మొదలైంది, సెట్ అంతా చప్పట్లతో మారుమ్రోగింది. కోట యాక్షన్ దెబ్బకు అక్కడున్న వారందరికీ ఫుల్ గా కిక్ ఎక్కింది. షాట్ విజయవంతంగా ముగిసింది.ఆ సీన్కి ఆడియన్స్ నుండి మంచి రియాక్షన్ వచ్చిందని కోడి రామకృష్ణ కూడా పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు.