యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. గత మూడేళ్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ రీసెంట్గా ముగిసింది. రెండు పాటల కోసం ఇద్దరు హీరోలతో పాటు చిత్ర బృందం ఉక్రెయిన్ వెళ్లింది. వారి షూటింగ్ ముగియడంతో బుధవారం రాత్రికి ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్లో ఇద్దరు హీరోలని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్గా మారాయి.
‘ఆర్ఆర్ఆర్’ టీం సెలబ్రేషన్స్కి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉక్రెయిన్లో జరుగుతున్న చివరి షెడ్యూల్ పూర్తి కావడంతో దర్శకుడు రాజమౌళితో పాటు ‘ఆర్ఆర్ఆర్’ టీం అంతా కలిసి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి హంగామా చేశారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీత పాత్రలో కనిపించనుంది. ఇక హాలీవుడ్ నటి ఒలివియా ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. శ్రియా శరణ్, అజయ్ దేవ్ గణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 13న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తుంది.