కరోనా తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా సినీ పరిశ్రమ పరిస్థితి దారుణంగా మారింది. సినిమా షూటింగ్స్ లేక కొన్నాళ్లు పని ఆగిపోగా, ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసిన సినిమాలను థియేటర్లో విడుదల చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో చాలా సినిమాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి.రీసెంట్గా నారప్ప చిత్రం అమెజాన్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు నాని నటించిన టక్ జగదీష్ కూడా ఓటీటీలో విడుదల అవుతుందనే టాక్ వినిపిస్తుంది.
కరోనా మొదటి వేవ్ సమయంలో థియేటర్స్ మూతపడడంతో నాని, సుధీర్ బాబు కాంబినేషన్లో వచ్చిన వి చిత్రం ఓటీటీలో విడుదలైంది. అప్పుడు అభిమానులు కాస్త అసహనానికి లోనయ్యారు. దీంతో నాని నటిస్తున్న టక్ జగదీష్ చిత్రాన్ని తప్పక థియేటర్స్లో విడుదల చేస్తామని చెప్పాడు.కాని రాను రాను వడ్డీలు పెరుగుతండడంతో నాని కూడా ఏం చేయలేకపోతున్నాడట.
టక్ జగదీష్ సినిమాను థియేటర్లలోకే తేవాలని ఇన్నాళ్లు ఓపిగ్గా వేచి చూసారు. రెండు కరోనా సీజన్లకు వడ్డీలు కూడా కట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. టక్ జగదీష్ సినిమాను ఓటిటికి ఇవ్వడం ఇష్టం లేక హీరో నాని ఇన్నాళ్లు ఆపుకుంటూ వచ్చారు. కానీ రాను రాను వడ్డీలు తడిసి మోపెడు అవుతున్నాయి.దీంతో నాని కూడా నిర్మాతలు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాడు. త్వరలోనే టక్ జగదీష్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.
ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి.