‘దర్శకుడు ఈ కథను నిజాయితీగా తెరకెక్కించాడు. లోతైన భావాలతో స్క్రిప్ట్ను సిద్ధం చేశాడు. కేవలం యువతనే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూడాల్సిన చిత్రమిది. ఈ తరహా పాయింట్తో ఇప్పటివరకు సినిమా రాలేదు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఇష్టపడతారనే నమ్మకం ఉంది’ అన్నారు దర్శకుడు మారుతి. ఆయన ఎస్కేఎన్తో కలిసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం ‘ట్రూ లవర్’. మణికందన్, శ్రీగౌరి ప్రియ జంటగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు.
ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ ‘తమిళ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ఇటీవలకాలంలో ఇలాంటి గొప్ప ప్రేమకథ రాలేదని చెబుతున్నారు. రిలీజ్కు ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. నేటితరం ప్రేమజంటల్లో ఉండే అభద్రతా భావాన్ని, సంఘర్షణను ఈ సినిమాలో భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. 200 థియేటర్లలో విడుదల చేస్తున్నాం’ అన్నారు. నేటి యువతకు కనెక్ట్ అయ్యే చిత్రమిదని నిర్మాత వంశీ నందిపాటి తెలిపారు. తమిళ ప్రీమియర్స్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నదని నాయకానాయికలు తెలిపారు.