రచయితగా తన కెరీర్ ప్రారంభించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరిగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నో భోగాలు అనుభవిస్తున్న ఆయన గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అవన్నీ తన రూమ్మేట్, కమెడీయన్ సునీల్కి తెలుసు.
పంజాగుట్టలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని త్రివిక్రమ్, సునీల్ సినిమా ప్రయాణం సాగించారు. ఈ ఇంట్లో నిద్రలేని రాత్రులు గడుపుతూ సినిమా కోసం ఇద్దరు ఎంతో కష్టపడ్డారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ మంచి దర్శకుడిగా ఎదిగితే, సునీల్ కమెడీయన్ నుండి హీరో స్థాయికి ఎదిగాడు. అయితే త్రివిక్రమ్ తాను ఉన్న ఇంటి జ్ఞాపకాలను వదులుకోవడం ఇష్టం లేక ఇప్పటికీ ఆ ఇంటికి ప్రతినెల ఐదువేల రూపాయలను అద్దె చెల్లిస్తున్నారు.
ఇండస్ట్రీలో చాలా మందికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. పంజాగుట్టలోని ఇంట్లో ఉన్న ఇంటితో త్రివిక్రమ్కి ఓ బాండింగ్ ఏర్పడి సెంటిమెంట్గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ ఇంటిని మర్చిపోలేక ఇప్పటికీ ఆ ఇంట్లో కూర్చుని తన సినిమాలకు కథలు, మాటలు రాస్తున్నారు. ఈ ఇంటిలో కూర్చుంటే కథలు రాయడం ఎంతో సులభంగా ఉంటుందని, అందుకే ఆ ఇంటికి ఇప్పటికే అద్దె చెల్లిస్తూ అక్కడే సినిమా కథలు రాస్తారని తెలియజేశారు.