చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అలాంటి వాటిలో మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. తాజాగా వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు.
పూజాహెగ్డే కథానాయిక. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ‘భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్, సంగీతం: తమన్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, నిర్మాత: ఎస్.రాధాకృష్ణ, రచన-దర్శకత్వం: త్రివిక్రమ్.