Venkatesh X Trivikram | ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న నటుడు విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్తో (Trivikram Srinivas) సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రామాలు పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ అక్టోబర్లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించనుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వెంకీ 77 అనే వర్కింగ్ టైటిల్తో ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి తాజాగా ఒక విషయం వైరల్గా మారింది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తన టీమ్ మొత్తాన్ని మార్చినట్లు తెలుస్తుంది. కొత్తవారిని ఈ సినిమా కోసం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు రాశారు. దర్శకుడయ్యాక ఆయన వెంకీతో సినిమా చేస్తారని అందరూ భావించారు. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. అయితే.. ఎట్టకేలకు వెంకీ, త్రివిక్రమ్ల కాంబినేషన్ సెట్ అవ్వడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.